NLR: ఉదయగిరి మండలం గండిపాలెంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో గురువారం ఆలయ ఛైర్మన్ పాముల రమణయ్య – వెంకటరత్నమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.