మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీముని పాదం జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. పచ్చని అడవుల మధ్య కనువిందు చేస్తున్న ఈ ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. నర్సంపేట-గూడూరు ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు సరైన వేదికగా మారింది.