కృష్ణా: మచిలీపట్నం బలరాంపేటకు చెందిన ఆలగుంట్ల అభి (22) అనే యువకుడు ఇంటి వద్ద నుంచి చనిపోతాను అని చెప్పి బయటకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్పేట పోలీసుల సమాచారంతో గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై షరీఫ్ స్పందించి, రామవరప్పాడు రైల్వే స్టేషన్ వద్ద యువకుడిని చేజించి నిన్న కుటుంబ సభ్యులకు అప్పగించారు.