కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ మేరకు 4 నెలల 18 రోజులకు గాను రూ.3,95,570 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకటరమణ మూర్తి తెలిపారు. పలివెల ఈవో పి.కామేశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ, సర్పంచ్ పల్లి భీమారావు తదితరులు పాల్గొన్నారు.