ASR: హుకుంపేట మండలం సూకూరులో శుక్రవారం SI దుర్గా ప్రసాద్ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు.