KMM: లైన్ మెన్ దినోత్సవం సందర్భంగా బుధవారం నేలకొండపల్లి మండల విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ రవి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తున్న లైన్ మెన్ల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావం అభినందనీయమన్నారు.