KDP: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కడప ITI సర్కిల్లో బుధవారం తాలూకా SI మోహన్ కుమార్ గౌడ్ ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, యూనిఫాం తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.