KMM: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నేడు ఉదయం 10:30 గంటల నుంచి డివిజన్ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తెలిపారు. డివిజన్ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.