VZM: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పేర్కొన్నారు. బుధవారం రాజాంలో జరిగిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల ఆవశ్యకతను గ్రామస్థాయిలో తెలిపేందుకు దోహదపడుతుందన్నారు.