PLD: జిల్లాలో ‘మన ఆరోగ్యం.. మన బాధ్యత’ పేరుతో పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్ల వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యకర సమాజమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. గత నెలలో శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ప్రతి నెల మొదటి గురువారం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.