TPT: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.