W.G: కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోటుపల్లి రామభాస్కరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మొగల్తూరు ఎస్సై జి. వాసు మంగళవారం తెలిపారు. వారతిప్ప గ్రామంలో మురుగు కాలువ గట్టుపై పాక వేసుకుని నివసిస్తున్న మల్లవరపు యేసు కుటుంబంపై రామభాస్కరరావు దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.