నెల్లూరులో చోరీలు, హత్యల వంటి కేసుల ఛేదనలో క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. వేలిముద్రలు, రక్త నమూనాల ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు. ఇటీవల గూడూరు, నవాబుపేట పరిధిలోని దొంగతనాల కేసులను ఈ బృందం ఛేదించింది. 2025లో ఇప్పటివరకు 50 కేసులను పరిష్కరించారు. అధునాతన సాంకేతికతతో నేరస్తుల డేటాబేస్ను ఉపయోగించి వీరిని గుర్తిస్తున్నారు.