NDL: మిడుతూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 12న జరుగుతుందని మండల పరిషత్ అధికారి దశరథ రామయ్య తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచులు, సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో మంచినీటి సమస్య, గృహ నిర్మాణ, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించి సమస్యలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.