CTR: చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ మనోహరన్ హఠాన్మరణం చెందారు. విధులకు వెళ్తూ దారిలో ఆయన కళ్లు తిరిగి కిందపడిపోయారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి తిరుపతి రూయాకు తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.