AP: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి అనే వ్యక్తి జనసేన కార్యాలయంలో భద్రతా సిబ్బంది కార్లు రెండింటిని ధ్వంసం చేశాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరాస్వామి తెలిపారు. నిందితుడిని మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిందని చెప్పారు.