MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామ శివారు మామిడి తోటలో ఇవాళ కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 25 పందెం కోళ్లు, రూ.65,000 నగదు, ఒక కారు, 5 ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.