PDPL: రామగుండం MLA MS రాజ్ ఠాకూర్, మనాలి దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు MLA తెలిపారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. MLA వెంట ఆయన సన్నిహితులు ఉన్నారు.