TG: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.