KDP: ప్రొద్దుటూరు పట్టణంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఇవాళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాటసారులకు మంచి నీటిని అందించడంతోపాటు, మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు మజ్జిగను కూడా అందిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.