W.G: రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఇవాళ పెదతాడేపల్లి, అలంపురం జాతీయ రహదారి కూడళ్లను రెవెన్యూ, రవాణా శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు అధికారులకు పలు సూచనలు చేశారు.