NLG: తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం జరగనుందని చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 4న బుధవారం ఉ. 10 గంటలకు చిట్యాలలోని మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీలు జరగనున్నాయి. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఉంటుందని తెలిపారు.