GNTR: దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం. సాయి కాంత్ వర్మ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి ఉపకరణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.