కరీంనగర్ నగర పాలక సంస్థ 14వ డివిజన్ చింతకుంట వాసుల ఏళ్లనాటి కష్టానికి తెరపడింది. శ్మశానవాటిక సమీపంలోని డంప్ యార్డు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ గుర్తించారు. ఇచ్చిన హామీ మేరకు అధికారులతో కలిసి ఇవాళ పర్యవేక్షించి, యార్డును అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.