ASF: వాంకిడి మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతన వార్డు సభ్యులకు ఈనెల 4వ తేదీ నుంచి 5రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు MPDO పాటిల్ జ్యోత్స్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. విధులు, బాధ్యతలు, అభివృద్ధిలో సభ్యుల పాత్ర అనే అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వార్డు సభ్యులందరూ ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.