E.G: సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత (30), అత్త గుమ్మడి లక్ష్మి(50)ని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం కత్తిని గోదావరిలో పడేసి సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 16 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, గొడవలతో విడిపోయిన వీరు ఒకే వీధిలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.