MNCL: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘూనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు.