బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తన ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా 2023లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.