KNR: ఆర్ఎస్ఎస్ అమృతేశ్వర శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ రేకుర్తిలోని మహాశివాలయంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలకు కంటి, షుగర్,బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని నగర కార్యావాహ మహేశ్వర్ పేర్కొన్నారు.