VSP: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం సీతంపేట పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. సభ్యత్వం పార్టీ బలోపేతానికి కీలకమని, బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది ముఖ్యమని తెలిపారు.