KMR: మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కొత్తగా ఆధార్ కేంద్రాన్ని తహసీల్దార్ ముజీబ్ ప్రారంభించారు. మండలంలో కొత్త ఆధార్ కార్డులతో పాటు ఆధార్ కార్డులు ఉన్నవారు అందులో మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు.