ప్రకాశం: తాడేపల్లిలోని ప్రకాశం జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి నివాసంలో ఈనెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.