KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే గ్రామ సుపరిపాలన సాధ్యమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గత వైసీపీ హయాంలో గ్రామాభివృద్ధిని అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదన్నారు.