BDK: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పేదలకు ఉపాధి పనులు ఇవ్వకుండా అపడాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సోమవారం పాల్వంచలో బి.చిరంజీవి అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముడిపెట్టి పేదల పొట్టకొట్టే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.