JGL: పెగడపల్లి మండల పరిధిలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ నుంచి మైనర్ కాలువలకు ఆదివారం అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన వారబందీ పద్ధతిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీరు చేరుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, కాలువ మొదట్లో ఉన్న రైతులు నీటిని వృధా చేయకుండా సహకరించాలని అధికారులు కోరారు. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలన్నారు.