ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 63 హైవేపై సోమవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుశీల్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.