JGL: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న (మంగళవారం) బీర్పూర్ శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయం మూసివేస్తున్నట్టు కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9 గం.లకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తామని, భక్తులు గమనించగలరని ఈఓ అన్నారు.