ADB: బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. యువతను క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో నిర్మించిన క్రీడలు, ఆట పోటీలు నేర్చుకునే స్థలం కేవలం బోర్డుకే పరిమితమైంది. ఇలా ఉంటే ఏమాత్రం పిల్లలు ఆటలు నేర్చుకుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి దీన్ని వినియోగానికి తిసుకురావాలని ప్రజలు కొరారు.