TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9:20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్, అక్కడి నుంచి 10 గంటలకు హెలికాప్టర్లో వికారాబాద్కు వెళ్తారు. పార్టీ బలోపేతంపై ఈ పర్యటనలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.