SS: మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో నరసింహమూర్తి తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు నిత్యపూజలు ముగించి, 8:30 గంటలకు తలుపులు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి, అభిషేకాలు నిర్వహించి, 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.