MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోల్కొండ కిషన్ రావు దేశ్ముఖ్ గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కోసం భూమిని దానంగా అందజేశారు. 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రావు దేశ్ముఖ్ పేర్కొన్నారు. సర్పంచ్ జ్యోతి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, పూజారి రమణచార్యులు పాల్గొన్నారు.