ఖమ్మం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు SR&BGNR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. జాకీరుల్లా తెలిపారు. మొత్తం 535 మంది ధరఖాస్తు చేసుకోగా.. 268 మంది హాజరయ్యారని, 267 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.