టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఛేదనకు పిచ్ అనుకూలంగా ఉంటుందని తెలిపాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుందని చెప్పాడు.