BHPL: రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్న ఎన్నికల హామీ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని TRP మొగులపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ పటేల్ డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ.4,000 ఆసరా పెన్షన్, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగ భృతి వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.