KMM: తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందువరుసలో ఉన్నామని DGP శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేయవచ్చన్నారు.