సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం రెవెన్యూ క్లినిక్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, కదిరి, మడకశిర డివిజన్ల అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భూమి సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదార్ పేరు మార్పులు తదితర ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఫిర్యాదులు సమర్పించాలని కోరారు.