AP: న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదన్నారు. కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలని సీజేఐ పేర్కొన్నారు.