NLG: మిర్యాలగూడలో రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇవాళ ఉత్సాహంగా జరిగింది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల హక్కుల కోసం INTUC ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారంతో పెయింటింగ్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.