కృష్ణా: మచిలీపట్నం-పెడన జాతీయ రహదారి 216పై ట్రాఫిక్ సీఐ నున్న రాజు హెల్మెట్ ధరించడంపై ద్విచక్ర వాహనదారులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ ధరించని వాహనదారులకు కేవలం ఫైన్ వెయ్యడమే కాకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా జరిపించాలని సూచించారు.