MBNR: పాలమూరు యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థి బడేసాబ్ రాయచూరులో నిర్వహించిన NIC 5K మారథాన్లో బాలుర విభాగంలో మొదటి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా వీసీ ప్రో. జీఎన్ శ్రీనివాస్, రిజిస్టార్ ప్రో పి.రమేష్ బాబులు విద్యార్థి ఉన్నత స్థానాలను చేరాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి,పీడీ డా వై శ్రీనివాసులు అభినందించారు.